Saturday, April 27, 2024

వ్యవసాయ శాఖ మంత్రికి ఘన సన్మానం

పరిగి : పరిగి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని పరిధిలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్వగృహంలో ఘనంగా సన్మానించారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్ మండలం చౌదర్పల్లి గ్రామ పర్యటనకు వెళుతున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరిగిలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్వగృహంలో కాసేపు ఆగారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డితో మంత్రి మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నరోత్తం రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కావాలి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement