Tuesday, May 7, 2024

‘ఎన్టీఆర్’ ఉన్న రోజుల్లో తెలుగుకి జాతీయ‌స్థాయి గుర్తింపు ఉండేద‌న్న బండారు ద‌త్తాత్రేయ‌

దివంగ‌త న‌టుడు, ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో తెలుగుజాతికి జాతీయ‌స్థాయి గుర్తింపు ల‌భించింద‌ని హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెద అమిరంలో అంత‌ర్జాతీయ తెలుగు సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బండారు ద‌త్తాత్రేయ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృభాష విశిష్టతను ప్రస్తావించారు. మాతృభాషను ఎప్పటికీ మర్చిపోరాదని, తాను ఇప్పటికీ తెలుగులోనే సంతకం చేస్తానని దత్తాత్రేయ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలుగు సంబరాలు తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని కొనియాడారు.

ఈ సంబరాల్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏ తరం అయినా తెలుగును చంపేయాలనుకుంటే, దాన్ని కాపాడేందుకు మరో తరం ఉవ్వెత్తున ఉద్భవిస్తుందని అన్నారు. తెలుగు భాషను తలదన్నే భాష మరొకటి లేదని ఆయన ఉద్ఘాటించారు. హైదరాబాదులో శిల్పారామాన్ని మించిపోయేలా తెలుగు సంస్కృతి ఉట్టిపడే వేదికను ఏపీలోనూ నిర్మించాలని సీఎం జగన్ కు లేఖ రాస్తానని స్వరూపానందేంద్ర వెల్లడించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబరాలకు ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement