Thursday, May 2, 2024

చినుకు ప‌డితే రోడ్లు చిత్త‌డే … వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని డిమాండ్

షాద్ నగర్ జూలై 26 ప్రభ న్యూస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో అభివృద్ధి చెందుతుంది అనుకుంటే అంతకు భిన్నంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని షాద్నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ ఆరోపించారు బుధవారం నాడషాద్ నగర్ నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్లే రహదారులు ఇంకా అద్వాన్నంగానే ఉన్నాయని ఏళ్ల తరబడి రోడ్డు లేక రాసుమల్ల గూడెం గ్రామస్తులు ఎన్నో అవస్థలు పడుతున్నారని షాద్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఫరుక్ నగర్ మండలంలోని రాసుమల్లెగూడెం గ్రామానికి వెళ్లే రహదారిని కాంగ్రెస్ నాయకులు తదితరులు పరిశీలించారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు ఇతర పనులపై వెళ్లే ప్రజలు, మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాసుమల్లె గూడెం రహదారిని వెంటనే నిర్మించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాములు, యాదయ్య, వెంకటయ్య, శ్రీను, రాఘవేందర్, రాజు, దశరథ్, నాగేశ్వర్, మహేందర్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement