Saturday, May 4, 2024

గుంట‌లు ప‌డ్డ రోడ్డు .. మ‌ర‌మ్మ‌త్తు చేయాలంటూ అక్క‌డే నాట్లు వేసిన నేత‌లు

మోత్కూర్ ,జులై 26( ప్రభా న్యూస్) మున్సిపల్ కేంద్రంలోని మోత్కూర్ -రాయగిరి మెయిన్ రోడ్డుపై టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద బీటీ రోడ్డుపై ఏర్పడ్డ భారీ గుంతలతో ప్రజలు ,ప్రయాణికులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ,తక్షణమే రోడ్డు మరమత్తు పనులు చేపట్టాలని కోరుతూ బుధవారం ఆ రోడ్డు గుంతల్లో బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నాట్లు వేసి నిరసన తెలిపారు. మోత్కూర్ బిక్కేరు వాగు బ్రిడ్జి నుండి రాజన్న గూడెం వరకు మెయిన్ రోడ్డుపై వెళ్లాలంటే విపరీతమైన గుంతలతో ప్రయాణికులు ,ద్విచక్ర వాహనాల చోదకులు వర్షాకాలంలో నీరు నిలిచి గుంతలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు మరమ్మత్తు పనులు తాత్కాలికంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.

.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రుగౌడ్ ,పురుగుల నరసింహ, ఉయ్యాల అంజయ్య, కారుపోతుల వెంకన్న గౌడ్, నిమ్మల శ్రీనివాస్ ,పట్టురి అంజయ్య ,అవిశెట్టి కిరణ్, నిలిగొండ మచ్చగిరి ,బందెల రవి, ఎండి అబ్బాస్, నరేందర్ రెడ్డి ,బొడిగే శీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement