Friday, May 17, 2024

అంకె పల్లి చెరువుకు గండి…

తాండూర్ జూలై 26 (ప్రభ న్యూస్ )మంచిర్యాల జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాండూర్ మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంకెపల్లి చెరువుకు గండి పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరుగుతుండడంతో చెరువులోకి భారీగా వరద చేరుతుంది. వరద నీటి ప్రవాహానికి మంగళవారం రాత్రి చెరువుకట్ట కు గండి పడింది.

సంఘటన స్థలాన్ని తాండూర్ రెవిన్యు ఇన్స్పెక్టర్ మురళి, సర్పంచ్ చీమల శంకర్, ఇరిగేషన్ అధికారులు చెరువును పర్యవేక్షించారు. చేరువు కింద సుమారు100 ఎకరాల ఆయాకట్టు ఉందనిచెరువుకు గండి పడడంతో సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement