Tuesday, May 7, 2024

NZB: వృద్ద దంపతులది హత్యే.. తేల్చిన పోలీసులు

బీర్కూర్, జులై 26, ప్రభ న్యూస్ : బీర్కూర్ మండలంలోని రైతు నగర్ గ్రామంలో వృద్ద దంపతులైన నారాయణ గుప్తా(73) ను తలపై మోది, సులోచన (64)ను చీరతో మెడకు గట్టిగా లాగి దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ ప్రొద్దున్నే షాప్ తీసే నారాయణ బయటకు రాకపోవడం, ఇంటి తలుపులు మూసి వుండటం గమనించిన నారాయణ బంధువు కృష్ణమూర్తి వెళ్లి చూసేసరికి మృతదేహాలు పడి ఉండడంతో గ్రామస్తుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం డీఎస్పీ జగన్నాథ రెడ్డి మృతదేహాలను పరిశీలించి క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్లను పిలిపించి వెతికించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా వెతికించగా, ఊరి చివరి ప్రాంతం వరకు వెళ్లి తిరిగి మృతదేహాల వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా డీఎస్పీ జగన్నాథ రెడ్డి మాట్లాడుతూ… నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు నారాయణ గుప్త, సులోచన స్వస్థలం నారాయణఖేడ్. ఆ ప్రాంతం నుండి సుమారు 37సంవత్సరాల క్రితం రైతునగర్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. మృతుడు నారాయణకు ముగ్గురు సోదరులు కాగా, ఇద్ధరు చెల్లెళ్లు ఉన్నారు. వారికి సంతానం లేరు. నారయణగుప్త తన ఇంటి ముందు కిరాణ షాప్ నడుపుకుంటూ, వడ్డీ వ్యాపారం చేసేవాడని గ్రామస్తులు తెలిపారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement