Sunday, April 28, 2024

Shabbir Ali – ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి చేసి చూపిస్తా…

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)23:నిజామాబాద్ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని… 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్య మని ధ్వజమెత్తారు.పాలించిన నాయకులు అభివృద్ధి చెందారే తప్ప పట్టణాన్ని అభివృద్ధి చేయలేదనీ మండిపడ్డారు.గురువారంనిజామాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి మాజీ మంత్రి షబ్బీర్ అలీ కంటేశ్వర్ కాలనీ వద్ద కార్నర్ మీటింగ్ లో నిర్వహిం చారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ..అన్ని వసతు లు కలిగిన పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయారనీ వాపో యారు.కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎలాంటి అభి వృద్ధికి నోచు కోలేదన్నారు.రోడ్లు, డివైడర్లు నిర్మించి అభివృద్ధి చేశామంటే అది హాస్యా స్పదమని అన్నా రు.శాశ్వత అభివృద్ధి చేయాలి.. యువత కు ఉపాధి కల్పించాలి విద్యా వైద్య రంగాల్లో పట్టణం చాలా వెనుకబడి ఉంద న్నారు

.కాంగ్రెస్ పార్టీని గెలిపించండి నిజామా బాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాననీ అన్నారు.పేదల జీవితాలు బాగుపడే విధంగా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్దామని అన్నారు.ఈ ప్రభుత్వ తీరుతో ప్రతి ఒక్కరూ నిరాశ నిస్పృహతో ఉన్నారన్నారు.భారీగా పరిశ్రమలు తీసుకువ చ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానుకాంగ్రేస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలతో ఇంటింటికి పోతామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపిస్తేనే పేదల సమస్యలు పరిష్కార మవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement