Thursday, May 2, 2024

NZB: కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఆగస్టు 18 (ప్రభ న్యూస్) : సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… నాటి పాలకుల అరాచకాలను అణిచి వేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మహనీయులు ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణిచివేసి అణగారిన వర్గాల పేదల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు.


అన్నివర్గాల వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, ప్రజాస్వామిక స్పూర్తితో పోరాడడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతిఒక్కరూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా గీతా కార్మికులకు కూడా బీసీ బంధు వర్తింపజేయాలని గౌడ సంఘం నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఆబ్కారీ అధికారి రవీంద్ర రాజు, సీపీఓ రాజారామ్, డీపీఆర్ఓ శాంతి కుమార్, జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, బీసీ సంఘాల నాయకులు బాలార్జున్ గౌడ్, గోపిగౌడ్, మహేష్ గౌడ్, శివరాం, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement