Thursday, May 2, 2024

AP: విజయవాడలో ప్రముఖ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్

విజయవాడలోని గుణదల ప్రాంతంలో ప్రముఖ హోటల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… విజయవాడలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌, ప్రముఖ హోటల్స్‌ వచ్చి… ఆంధ్ర రాష్ట్రం కూడా గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాం మీద, ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఒక ప్రత్యేకమైన స్ధానం పొందాలన్నారు. మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చామన్నారు. మంచి టూరిజం పాలసీని తీసుకుని రావడమే కాకుండా, మంచి చైన్‌ హోటల్స్‌ను కూడా ప్రోత్సహిస్తూ వచ్చామన్నారు.


ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న ఈ హోటల్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాన్నారు. వారందరికీ ఇలాంటి ప్రోత్సాహకాలిచ్చి ఏపీని వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విజయవాడ నగరంలో మంచి ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ హోటల్స్‌ ఇంకా రావాలని, ఇవి రాష్ట్రమంతటా విస్తరించాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా, గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement