Thursday, May 16, 2024

సలేశ్వరం జాతరలో అపశృతి.. దర్శనానికి వచ్చి ఇద్దరు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీ కారణంగా ఊపిరి ఆడక నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందగా, వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన అభిషేక్ (32) అనే యువకుడు ఊపిరి ఆడక మృతిచెందారు. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా… అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement