Friday, April 26, 2024

TS : ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు…

ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌రగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌-ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో టీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుప‌నున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం హైద‌రాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బస్సులను నడుపుతోందని చెప్పారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement