Thursday, May 2, 2024

ఆర్టీసీ బస్సు – కంటైనర్ ఢీ ……ప్ర‌యాణీకులు సేఫ్

బిక్కనూర్ జులై 28 ప్రభా న్యూస్… ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్ గా బ్రేక్ వేయడంతో దాని వెనకాలే వస్తున్న కంటైనర్ వాహనం బస్సును ఢీ కొట్టింది . ఈ బస్సులో ఉన్న ఒకరికితలకు తీవ్ర గాయాలయ్యాయి, మరో 35 మంది సురక్షితంగా ఉన్నారు వివరాలు ఎలా ఉన్నాయి.హైదరాబాద్ నుంచి 36 మంది ప్యాసింజర్లతో బోధన్ కు బయలుదేరిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బస్వాపూర్ గ్రామ సమీపంలోని44 జాతీయ రహదారి హైవే బ్రిడ్జి సమీపంలోనికి రాగానే, బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో అదే దారిలో వెనకాలే వస్తున్న కంటైనర్ వాహనం వెనకాల నుంచి వచ్చి బస్సును ఢీ కొట్టింది .

ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని అంబులెన్స్ లో మెదక్ జిల్లా రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా ప్రయాణికులు వేరే బస్సులు వారి గమ్యస్థానానికి వెళ్లిపోయారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement