Friday, May 3, 2024

దత్తాత్రేయస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. స్పెష‌ల్ టూర్ ప్ర‌క‌టించిన టీఎస్ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. గానుగాపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌ ఆలయాల దర్శనం సైతం కల్పించనున్నారు. ప్రత్యేక బస్సు ఈ నెల 31న ఉద‌యం హైదరాబాద్‌ నుంచి గానుగాపూర్‌ ఆలయానికి ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుంది. కాగా, ఈ టూర్ ప్యాకేజీ ముందస్తు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా.. భక్తులు http://tsrtconline.in వెబ్ సైట్ లోకి వెళ్లి తమ టికెట్లను బుకింగ్ చేసుకోగలరని టీఎస్ ఆర్టీసీ అధికారులు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement