Sunday, April 28, 2024

TS: 90రోజుల్లోనే ప్ర‌జాభిమానాన్ని కోల్పోయిన రేవంత్… కేటీఆర్

కరీంనగర్ – రేవంత్ ప్ర‌భుత్వం.. 90 రోజుల్లోనే ప్ర‌జాభిమానాన్ని కోల్పోయి ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయ్యింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ లో ఈనెల 12న జరుగబోయే కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… గ‌తంలో టీడీపీని ముంచిండు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా ముంచేట‌ట్టు ఉన్నార‌ని ముస్లిం సోద‌రులు భావిస్తున్నారన్నారు. మోడీని రేవంత్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారన్నారు.

ఆత్మ‌గౌర‌వం క‌లిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడ‌ని, ఒప్పుకొని మాట‌లు రేవంత్ మాట్లాడారన్నారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌ను చూసి హ‌ర్ ఘ‌ర్ జ‌ల్, మిష‌న్ కాక‌తీయను చూసి అమృత్ స‌రోవ‌ర్ అని పెట్టుకున్నారు. అలా అన్నిరంగాల్లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా మారిందన్నారు. అలాంటి తెలంగాణ మోడ‌ల్‌ను కించ‌ప‌రుస్తూ.. గుజ‌రాత్ మోడ‌ల్‌ను చేస్తాం ఈ రాష్ట్రాన్ని అని రేవంత్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement