Monday, April 29, 2024

Rescue | అడవిలో చిక్కుకున్న సందర్శకులను కాపాడుతాం: ములుగు ఎస్పీ

ముత్యాల దారా జలపాతం వీక్షించడానికి వెళ్లిన సందర్శకులు దారితప్పి అడవిలో చిక్కుకున్న విషయంపై ములుగు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి పంపించామ‌ని, వారిని కాపాడి తీరుతామని చెప్పారు.
సందర్శకులతో ఫోన్ లో మాట్లాడిన‌ట్టు తెలిపారు.

వాగు దాటేందుకు ఎట్టి పరిస్తుతులలో ప్రయత్నించవద్దని, రెస్క్యూ బృందాలు వ‌చ్చే వ‌ర‌కు ఓపిక‌తో ఉండాల‌ని సూచించారు. అప్పటివరకు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని, వారి మొబైల్ ఫోన్ల‌ను రెస్పాన్స్ కోసం బ్యాట‌రీ కాపాడుకునేలా ఉండాల‌ని సూచించారు. దిగులు చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని ఆహార పదార్థాలు, ఇతర రెస్క్యూ పరికరాలు పంపించినట్లు చెప్పారు. ఘటనపై ఎస్పీ గౌస్ ఆలం అధికారులను అప్రమత్తం చేసి వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement