Monday, May 13, 2024

Vikarabad: ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే ఉంటా.. సుధాకర్ రెడ్డి

వికారాబాద్ జులై 25( ప్రభ న్యూస్): తన ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ను మరోసారి ఎమ్మెల్యే చేయడమే తన ముందున్న లక్ష్యమని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి తెలిపారు.

మంగళవారం ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నారెడ్డి, కౌన్సిలర్లు మురళి వేణుగోపాల్ రెడ్డి, నాయకులు వాయిద్య హనుమంతు శ్రీనివాస్ ముదిరాజ్ జంగయ్య తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ తన నివాసానికి రావడం, తనను ఆహ్వానిస్తున్నప్పటికీ ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. తాను ఏ పార్టీలో చేరనని, తనను కొనే సత్తా ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఆనంద్ హోటల్లో మరోసారి తన ప్రయత్నం చేస్తున్నారని, ఈ సాధారణ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ విజయం సాధించడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement