Saturday, April 27, 2024

నస్కల్ బ్రిడ్జిని పరిశీలించిన వికారాబాద్ ఆర్డీఓ విజయ కుమారి

వికారాబాద్, జులై 27 ( ప్రభ న్యూస్): భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్ డివిజన్ పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. ఈ సందర్భంగా వాటి పరిస్థితిని పరిశీలించేందుకు వికారాబాద్ ఆర్డీఓ విజయ కుమారి పోలీసులతో కలిసి సంబంధిత వాగులు వంకలను పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రధానంగా వాగులు పొంగే ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేయాలని ఆర్డీఓ విజయకుమారి సూచించారు. జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు, ప్రాజెక్టులు వరద నీరు వాగుల్లో, పంకల్లో పొంగి ప్రవహించే ప్రమాదం ఉందని, ముందస్తుగా ఆ చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement