Wednesday, May 1, 2024

Rains & Floods – ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడ‌ట‌మే ప్రధమ కర్తవ్యం – కెటిఆర్

హైద‌రాబాద్ – భారీ వర్షాలు,వ‌ర‌ద‌ల‌పై నిరంత‌రం సమీక్ష చేస్తున్నామ‌ని మంత్రి కెటిఆర్ వెల్ల‌డించారు.. అలాగే ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అన్ని విష‌యాలు తెలుసుకుని త‌గిన సూచ‌న‌లు ,ఆదేశాలు సంబందిత శాఖ‌ల‌కు,అధికారుల‌కు ఇస్తున్నార‌ని చెప్పారు.. హైద‌రాబాద్ లోని ఆయ‌న నేడు వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల‌లో ప‌ర్య‌టించారు.. ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న హుస్సెన్ సాగ‌ర్ ను ప‌రిశీలించారు..

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,
“రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలల‌పై పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోనూ జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారు . పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేయడం జరిగింది.  పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నాం. కుంభవృష్టిగా వర్షం పడడం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నది. కానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది . మా ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమే” అని చెప్పారు..

“హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది . హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం.. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం . డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది . గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గింది. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తుంది.


ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి.
భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం  దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు.
ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది” అని కెటిఆర్ సూచించారు.

- Advertisement -

” వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం .. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం . చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం . మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం . వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం” అని అంటూ, వ‌రంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామ‌ని,. అవసరమైతే రేపు తాను కూడా స్వయంగా వెళ్తాన‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement