Thursday, May 16, 2024

మేడ్చల్ అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయేందర్రెడ్డి

ప్రభ న్యూస్, ప్రతినిధి మేడ్చల్, జులై 19: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా విజయేందర్రెడ్డి జిల్లా కలెక్టరేట్ లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన నర్సింహారెడ్డి బదిలీ కాగా.. ఆయన స్థానంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో గజ్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా విధులు నిర్వహించిన విజయేందర్రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ గా విజయేందర్రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి చంద్రావతి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement