Sunday, May 19, 2024

రైతును రాజు చేయడమే లక్ష్యం : మంత్రి మల్లారెడ్డి

రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత మండలమైన మూడు చింతలపల్లి మండలం పర్యటనలో భాగంగా లక్ష్మాపూర్ గ్రామ రైతులకు 176 పాస్ పుస్తకాలను ఈరోజు మంత్రి మల్లారెడ్డి రైతులకు అందజేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా లక్ష్మాపూర్ గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు గ్రామ సర్వే నిర్వహించి రైతులకు పట్టాదారు పాసు బుక్కులు అందజేస్తారని తెలిపారు. ఇప్పటికే మొదటి విడత కింద మూడు వందల మందికి పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వగా… ఈ రోజు మరో 176 మందికి పాస్ పుస్తకాలు అందజేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత తెలంగాణ రాష్టానికి దక్కుతుందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement