Thursday, May 2, 2024

కెసిఆర్ పాల‌న‌తోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్ జూలై 25 ప్రభ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోగ్రామాల మరింత అభివృద్ధి జరిగాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. అన్నారు. మంగళవారం నాడు ఫరుఖ్ నగర్ మండలంలోని కుందేల్ కుంట తండాలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు, చింతగూడ గ్రామంలో 15 లక్షలతో ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు 69 యూనిట్ల గొర్రెల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నేరేళ్ళ చెరువు గ్రామంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాడు వెలవెలబోయిన గ్రామాలు నేడు అభివృద్ధితో కలకలలాడుతున్నాయ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి గ్రామం ఆదర్శంగా మారుతోందన్నారు. అదే విధంగా గొల్ల కురుమల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ కృషి చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement