Wednesday, May 15, 2024

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శామీర్ పేట, (ప్రభ న్యూస్ ): మద్యం మత్తులో కిందపడి గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు శామీర్ పేట పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శామీర్ పేట్ గ్రామ పరిధిలోని పెద్దమ్మ కాలనీలో నివాసం ఉంటున్న సాతనోళ్ల బసప్ప(45) అనే వ్యక్తి తన కుటుంబం తో కలిసి, అదే గ్రామము లో రాయి పని చేసుకుని జీవిస్తున్నాడు .

అతనికి రోజూ మద్యం సేవించే అలవాటు కలదు, అయితే ఈ నెల 1వ తేదీన రోజులాగే మద్యం సేవించి రాత్రి సమయం అందాజ 9 గంటల ప్రాంతంలో తన కుటుంబ సబ్యులతో భోజనం చేసి పడుకొని తిరిగి అందాజ రాత్రి 11 గంటల ప్రాంతంలో అతను బాత్రూమ్ కి వెళ్ళుటకు నిద్ర లేచి బాత్రూమ్ కి వెళ్ళి మద్యం మత్తులో బాత్రూమ్ లో కింద పడడంతో గాయాలయ్యాయి.

- Advertisement -

అతనికి ఇంతకుముందు ఆపరేషన్ అయిన కడుపు భాగంలో దెబ్బ తగలగా ఆరోజు రాత్రి అతను స్వల్ప కడుపు నొప్పి తో ఇంట్లోనే పడుకోగా తెల్లారి మరుసటి రోజు 2వ తేదీన అతనికి కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో అతని కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ కి తరలించారు. కాగా బసప్ప చికిత్స పొందుతూ అదే రోజు మద్యాహ్నం 2 -35 గంటల ప్రాంతంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య నర్సమ్మ ఇచ్చిన ఫిర్యాధు మేరకు శామీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement