రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఈరోజు ఆర్థిక మంత్రి హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలే యాదయ్య, నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ బాలరెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ చిట్ల దివాకర్, నాయకులు బొంగునూరి ప్రభాకర్ రెడ్డీ, పోలీస్ గోవింద్ రెడ్డీ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital