Friday, May 10, 2024

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మండలం డబీల్ పూర్ గ్రామంలో రూ.1.05 కోట్లతో చేపట్టిన పంచాయతీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నంద రెడ్డి, ఎంపీపీ రజిత రాజ మల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, సర్పంచ్ గీత భాగ్య రెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement