హైదరాబాద్ : సుప్రసిద్ధ అగ్రోకెమికల్ సంస్థ అయిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ విద్యాభివృద్ధికి మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తన నిబద్ధతను ప్రకటించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ సహకారంతో, ఈ బ్రాండ్ వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రెసివ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అంకుర్ అగర్వాల్ దివంగత తల్లి శ్రీమతి కనక్ అగర్వాల్ గౌరవార్థం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.
క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అంకుర్ అగర్వాల్ మాట్లాడుతూ…. క్రిస్టల్ క్రాప్ వద్ద తాము భారతదేశ వ్యవసాయ రంగంలో మహిళలు పోషించే కీలక పాత్రను తాము ఎంతో గౌరవిస్తామన్నారు. ఈ స్కాలర్షిప్ కార్యక్రమ ప్రారంభంతో, బాలికల విద్య కోసం నిష్కపటం గా ప్రయత్నించిన తమ తల్లికి తాము నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ వర్ధమాన ప్రతిభావంతులకు అవసరమైన మద్దతు అందించటం ద్వారా వారు విద్యాపరంగా రాణించడమే కాకుండా కెరీర్ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కూడా ముందుకు సాగాలని తాము భావిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం జూలై, ఆగస్టు, 2024లో జరగబోయే సెషన్ నుండి ప్రారంభమవుతుందన్నారు. దరఖాస్తుదారులు మరింత సమాచారాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ క్రిస్టల్ క్రాప్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు. ఈ ఉదాత్తమైన కార్యక్రమం ద్వారా తాము విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తున్నామని ఐసీఏఆర్ డేర్ అండ్ డైరెక్టర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.