Tuesday, May 7, 2024

VKB | ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాలపై క‌న్నేసిన లీడ‌ర్లు.. ఆస‌క్తిగా రాజ‌కీయాలు!

వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు లీడ‌ర్లు ఇతర నియోజకవర్గంలో పోటీచేసేందుకు తీవ్రంగా యత్తిస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి చంద్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో వికారాబాద్ నుండి 5 దఫాలు గేలిచిన ఆయన ఈ సారి వికారాబాద్ లో కాకుండా చేవెళ్లలో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఈనెల 26న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖ‌ర్గే నేతృతంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. చేవెళ్ల నుండి లేదా జహీరాబాద్ నుండి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా పిసిసి ప్రధాన కార్యదర్శి తాండూర్ జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ధరూర్ మండలం అంతారం గ్రామానికి చెందిన రఘురారెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు టికెట్ లభించే అవకాశాలు అధికంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement