Tuesday, May 21, 2024

సర్పంచ్ ను అరెస్ట్ చేయాలని కోరుతూ.. దళితుల ధర్నా

చేవెళ్ల,(ప్రభ న్యూస్):జూలై 15. దళితులపై దాడికి పాల్పడిన అగ్రకుల సర్పంచ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని చేవెళ్లలో దళిత సంఘాలు రోడ్డుపై శనివారం మధ్యాహ్నం బైఠాయించారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ శేరి శివారెడ్డి గ్రామానికి చెందిన ఓ దళితుడు సంజీవ, మరి కొందరి దళితులపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడ్డాడు. బోనాల ఉత్సవం ముందు దళితుడైన సంజీవ ఆతని స్నేహితులు నృత్యం చేస్తుండగా ఈ అగ్రకుల ఉత్సవం ముందు నీకేం పని అంటూ సర్పంచ్ శివారెడ్డి, అతని అనుచరులు దాడికి దిగారు.

ఇష్టానుసారంగా దళితులను చితకబాదారు. కాగా దళితులు పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిపా పోలీసులు పట్టించుకోవడం లేదని దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. చివరకు ఏసీపీ ప్రభాకర్ ధర్నా స్థలికి వచ్చి సర్పంచ్ శివారెడ్డిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు ధర్నాను విరమించాయి. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు పడాల వెంకటస్వామి, రామస్వామి, బి.రాములు, రవీందర్, తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement