Saturday, May 18, 2024

కాంగ్రెస్‌ను నుంచి గులాబీ గూటికి… హరీష్ సమక్షంలో తీర్థం పుచ్చుకున్న నేతలు

ఉమ్మడి మెదక్ బ్యూరో : మంత్రి హరీశ్ రావు సమక్షంలో మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.ఎస్.హెచ్.డి.సి చైర్మన్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో మాజీ సర్పంచ్ లు పట్లోళ్ల జయ రాములు, పోల్కంపల్లి కృష్ణ, ప్రస్తుత ఉప సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మయ్య, డీలర్ శ్రీనివాస్ గౌడ్, మన్నే మల్లేశం, పోల్కంపల్లి దుర్గయ్య, ఎండి సయోద్దిన్ ఉన్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారన్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరాలని ఉత్సాహంతో ఉన్నారన్నారు.. ఓడిపోయినా పట్టుదలతో నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తున్న చింతా ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న చింతా ప్రభాకర్ ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటామని చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు. చింతా ప్రభాకర్ లాంటి నాయకుడు దొరకడం సంగారెడ్డి ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement