Tuesday, May 7, 2024

కల్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే వివేకానంద్ , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజా భూమి పూజ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి 17 వార్డ్ పరిధిలోని రామాలయం ఆలయ ప్రాంగణంలో రూ. 30 లక్షల వ్యయం తో నిర్మించే కల్యాణ మండపం నిర్మాణానికి ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. స్థానిక చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ లు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో పూజలు చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే కె.పి మాట్లాడుతూ , ఈ కల్యాణ మండపం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి పండగలకు,శుభకార్యాలకు, సమావేశాలకు అనుకూలంగా దీన్ని నిర్మించనున్నారని, దూలపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య , బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశ నరేందర్ రాజు, కౌన్సిలర్ డప్పు కిరణ్, ఆలయ కమిటి చైర్మన్ బూర్గుబావి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గరిశ సతీష్, బూరుగుబావి హనుమంత్ రావు, పాక్స్ చైర్మ నరేందర్ రాజు, పీఏసీఎస్ డైరెక్టర్లు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement