Sunday, May 5, 2024

WGL: బైక్ ను ఢీ కొట్టిన లారీ.. ఒకరు దుర్మరణం

గణపురం, జులై 15 (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పుర్ శివారు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద ప్రధాన రహదారిపై శనివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధి వీరయ్యపల్లి గ్రామానికి చెందిన మొగులోజు సత్యం (35) కేటిపిపిలో డిఏవి స్కూల్ బస్ క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మిగతా సమయంలో కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఇవాళ ఉదయం పాఠశాల బస్ క్లీనర్ పని ముగించుకుని తిరిగి కార్పెంటర్ పనికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో జెన్కో మూలములుపు వద్దకు రాగానే రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ఎక్కువ వుండటంతో గమనించిన సత్యం బైక్ ఇండికేటర్ వేసి రోడ్డు పక్కనే వేచి వున్నాడు. కాగా భూపాలపల్లి నుండి చెల్పుర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ సత్యం ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం సహా సత్యంను కొద్దిదూరం లారీ ఇడ్చుకెల్లగా ద్విచక్ర వాహనం, సత్యం నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న గణపురం ఎస్సై అభినవ్ ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం వద్ద సత్యం భార్య, తల్లి రోదనలు మిన్నంటడం అందరినీ కలిచివేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement