Sunday, May 19, 2024

Breaking : ఏపీ డీజీపీపై ఈసీ బ‌దిలీ వేటు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంట‌నే రిలీవ్ కావాల‌ని ఈసీ ఆదేశించింది. రేపు ఉద‌యం 11 గంట‌ల్లోగా కొత్త డీజీపీ నియామ‌క ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని ఈసీ తెలిపింది. ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాల‌ని ఈసీ సీఎస్ ను ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది.

అయితే, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2018 నుంచి 2019 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుంచి 2020 వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పని చేశారు. ఆ తర్వాత 2020, ఫిబ్రవరి 19న ఏపీ డీజీపీగా నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement