Sunday, May 19, 2024

MBNR: కాంగ్రెస్ లో చేరిన హాజీపూర్ గ్రామ వడ్డెర సంఘం నాయకులు..

అచ్చంపేట మే 5, ప్రభ న్యూస్ : అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన దాదాపు 50మంది బీఆర్ఎస్ పార్టీ వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వగృహం అచ్చంపేటలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరామని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లురవిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పూలదండలు వేసి సత్కరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement