Monday, May 6, 2024

పకడ్బందిగా కర్ఫూ అమలు..

వికారాబాద్‌ : టౌన్‌ సర్కిల్‌ పరిధిలో రాత్రి కర్ఫూను పకడ్బందిగా అమలు చేస్తున్నామని.. రాత్రి 8 గంటలకు అన్ని దుకాణాలను మూయించి 8.30 గంటల లోపు పూర్తిగా కర్ఫూ అమలు చేస్తున్నట్టు వికారాబాద్‌ టౌన్‌ సిఐ.. జి.రాజశేఖర్‌ తెలిపారు.ఆయన ప్రభ న్యూస్‌తో మాట్లాడుతు తనతో పాటు సర్కిల్‌ పరిధిలో గల నలుగురు ఎస్‌ఐలు సిబ్బంది నిరంతరం కర్ఫూ అమలు చేస్తున్నామన్నారు.ప్రజలు కూడా పూర్తి సహకారం ఇవ్వాలని కోరారు.పూర్తి స్ధాయిలో కరోనా నిబంధనలను అమలు చేయటంతో పాటు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని,మాస్క్‌లు ధరించాలని ఆయన సూచించారు.ప్రధానంగా కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే మాస్క్‌లు ధరించటం,భౌతిక దూరం పాటించటం,శానిటైజర్‌ చేసుకోవటం మంచి పని అని అన్నారు.ఆటోలలో సహితం పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే జరిమానా తప్పదని అన్నారు.కరోనా నివారణ అందరి బాధ్యత అని ఎటువంటి అపోహలకు గురి కాకుండా తప్పని సరిగా వాక్సిన్‌ వేయించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement