Friday, April 26, 2024

మానేరు వాగులో ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు జలసమాధి

పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా సమీపంలోని మానేరు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం ఇద్దరు సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన వారు ఒకరు వేములవాడకు చెందిన వారు రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో ఇద్దరు క్షేమంగా బయటపడగా ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఐతరాజు పల్లికి చెందిన జోగుల మనోజ్(35), జోగుల అషేష్(9), వేములవాడకు చెందిన పెంట రాహుల్(20) మృతి చెందారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. బంధువులను కలిసేందుకు వీరు నీరుకుల్ల గ్రామానికి వచ్చారని స్థానికులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement