కరోనా వేళ బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఈ రోజు ఉదయమే ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ కరోనా కన్నుమూసారు. ఈ విషాదాలు మరవక ముందే మరో బాలీవుడ్ నటుడు అమిత్ మిస్త్రీ గుండెపోటుతో కన్నుమూసారు. ఈయన బాలీవుడ్తో పాటు పలు గుజారాతి సినిమాల్లో నటించారు.
అమిత్ మిస్త్రీ నటుడే కాదు.. రచయత, దర్శకుడు కూడా. ఇటీవల ‘బందిష్ బండిట్స్’ వెబ్ సిరీస్ లో అమిత్ మిస్త్రీ అలరించారు. క్యా కహ్న, ఏక్ చాలిస్ కి లాస్ట్ లోకల్, 99, షోర్ ఇన్ ది సిటీ, యామ్లా పగ్లా దీవానా, బే యార్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో బండిష్ బండిట్ వెబ్ సిరీస్లోను నటించి అలరించాడు. మిస్త్రీ అకాల మరణంపై బాలీవుడ్తో పాటు గుజరాతీ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన సినిమా, టీవీ నటుల సంఘం ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.