Friday, May 3, 2024

మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌లో క‌రోనా క‌ల‌కలం..

వికారాబాద్‌: మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న పాఠశాలలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ సోకింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మందికి పైగా 8, 9, 10తోపాటు ఇంటర్‌ చదువుతున్నారు. వైద్యాధికారులు వారినుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. పాఠ‌శాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement