Friday, May 3, 2024

శంకర్ ప‌ల్లి మున్సిపాలిటీలో కరోనా కలకలం

శంకర్ ప‌ల్లి మునిసిపాలిటీలో కరోనా వైరస్ కలకలం చోటుచేసుకుంది. మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడిన‌ట్లు తెలుస్తోంది. మొత్తం 18 మంది ఉద్యోగులు పనిచేస్తుండ‌గా, వారిలో ఎనిమిది మంది లక్షణాలతో టెస్టులు చేయించుకోగా, వారిలో ఆరుగురికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఐదారుగురు ఉద్యోగులు నాలుగు రోజుల నుండి జలుబు జ్వరంతో బాధపడుతూ విధులు నిర్వర్తిస్తుండ‌డం కారణంగా వైరస్ తీవ్రత పెరిగింది. వీలైనంత తొందరగా మిగతా సిబ్బంది కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలో పాల్గొని తమ ఆరోగ్యాలను కాపాడుకొని, వైరస్ పట్టణ పరిధిలో వ్యాప్తి చెందకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement