Saturday, May 11, 2024

పెరుగుతున్న కరోన కేసులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత కొంత కాలంగా నిలకడగా ఉన్న కరోన పాజిటివ్ కేసులు గత రెండు రోజులనుండు అమాంతంగా పెరుగుతుండడంతో నియోజకవర్గం ప్రజలలో మరో మారు గుబులు మొదలయింది. ఈ .ఆదివారం 269 మందికి కరోన పరీక్షలు నిర్వహించగా 22 మంది కి కరోన నిర్ధారణ కాగా సోమవారం 387 మందికి కరోన ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా ఏకంగా 32 మందికి నిర్ధారణ కావడం ఆందోళన కలిగించేవిష‌యం.షాపూర్ నగర్ లో 71 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోన నిర్ధారణ కాగా గాజులరామారంలో 59 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కుత్బుల్లాపూర్ లో 76 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి దుండిగల్ లో 139 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి సూరారంలో 42 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోన నిర్ధారణ అయినట్లు వైదులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement