Monday, May 20, 2024

Breaking: లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల వ్యక్తి మృతి

మోమిన్ పేట : ఓ లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని వెల్చాల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ ప్రకాశ్ తెలిపిన వివరాల మేరకు వెల్చాల్ గ్రామ సమీపంలోని మైనింగ్ లారీ (ఏపి 22 డబ్ల్యూ 2556) మట్టి నింపుకొని గ్రామ సమీపంలోని వే బ్రిడ్జి వద్దకు వస్తుండగా మోమిన్ పేట వైపునుండి వస్తున్న ద్విచక్ర వాహనం స్పెండర్ (కేఏ 38 క్యూ 7884) పై వస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్ళగా ఆవ్యక్తి అక్కడిక‌క్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బైక్ ఆర్సీ ఆధారంగా కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ తండ్రి మల్లప్ప (32) గా గుర్తించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ విజయప్రకాశ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement