Saturday, May 4, 2024

ఏఎన్ఎంలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి

బొంరాస్ పేట్, ఆగస్టు 10(ప్రభ న్యూస్) : ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని బొంరాస్ పేట్ మండల ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం జులై 26న విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఏఎన్ఎంల సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఎన్ఎంలు శ్రీలత, లీలావతి, పుష్పలత, అంజలి, హైమావతి, పద్మావతి, షహాదా బేగం, కవిత, రాములమ్మ, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement