Saturday, April 27, 2024

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎల్ల‌ప్పుడూ ముందుంటా : కేపీ వివేకానంద్

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాను ఎల్ల‌ప్పుడూ ముందుంటాన‌ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని వివేకానంద్ నగర్ సంక్షేమ సంఘం ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం.చందు, జనరల్ సెక్రెటరీ యాదగిరి, ట్రెజరర్ సంతోష్, చలం రెడ్డి, సురేష్, చాంద్, అలీ, ఏసప్ప, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement