Wednesday, May 1, 2024

నిత్యావసర వస్తువులు అమ్మిన మాజీ మంత్రి సోమిరెడ్డి

ముత్తుకూరు ప్రభ న్యూస్ : గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు,ఎరువులు, డీజిల్ ,పెట్రోల్ ధరలు వ్యత్యాసం చూపుతూ ప్రాక్టికల్ గా వినూత్న రీతిలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఓ కార్యక్రమం చేపట్టింది. తాసిల్దార్ కార్యాలయం సెంటర్ నుండి, బస్టాండ్ సెంటర్ వరకు ప్రతిపక్షం ర్యాలీ నిర్వహించింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టారు. బస్ స్టాండ్ సెంటర్ నడిబొడ్డున నిత్యవసర వస్తువులు టేబుల్ పై పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది మహిళలు మాజీ మంత్రి సోమిరెడ్డి చేతులు మీదుగా విక్రయించిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేశారు.

ఫలానా వస్తువు టిడిపి ప్రభుత్వంలో ధర ఎంత ,వైసీపీ ప్రభుత్వంలో ధర ఎంత అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విచ్చేశారు. అదేవిధంగా అధికార పార్టీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, గుమ్మడి రాజయాదవ్, సన్నా రెడ్డి సురేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, స్థానిక టిడిపి నాయకులు వై కోదండరామయ్య, పల్లికొండ శీనయ్య, అక్కయ్యగారి ఏడుకొండలు, ఎల్లం గారి రమణయ్య, ఎల్లసిరి రాజేష్ గౌడ్, దండు శ్రీనివాసులు,అరెద్దుల శ్రీనివాసులు,యదనపర్తి శ్యామ్ రెడ్డి, షేక్ అలీ ముత్తు, వావిళ్ళ జనార్ధన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement