Friday, April 26, 2024

Breaking: పవన్ కల్యాణ్ కుమారుడికి కరోనా

టాలీవుడ్ ను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రేణుతో పాటు ఆమె తనయుడు అఖీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

‘’ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు, అఖీరాకు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మేము ఇద్దరం ఇప్పుడు కోలుకుంటున్నాము. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను… కోవిడ్ థర్డ్ వేవ్ ని సీరియస్ గా తీసుకోండి. మాస్కులు ధరించండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి’’ అని రేణు పేర్కొంది. తాను గత ఏడాదే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకున్నానని తెలిపింది. అఖీరాకు మాత్రం ఫస్ట్ డోస్ అయిందని, రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించాల్సిన సమయంలోనే కరోనా పాజిటివ్ అని తేలిందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement