Tuesday, May 7, 2024

Rangareddy: తొమ్మిదేళ్ల బాలిక స‌హా వృద్దురాలు దారుణ హ‌త్య‌

తొమ్మిదేళ్ల బాలిక స‌హా వృద్దురాలు దారుణ‌హ‌త్య‌కు గురైన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నెల క్రితం పార్వ‌తమ్మ ఇంట్లో జంట అద్దెకు దిగింది. ఇల్లు ఖాళీ చేయించింద‌ని భార్యాభ‌ర్త‌లు క‌క్ష్య పెంచుకున్నారు. నిద్రిస్తున్న ఇద్ద‌రినీ దంప‌తులు గొంతు కోసి హ‌త్య‌చేశారు. అలాగే బీరువా ప‌గుల‌గొట్టి న‌గ‌దు, బంగారం అప‌హ‌రించారు. జిల్లాలోని షాద్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నందిగామ‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. హ‌త్య చేసిన దివాక‌ర్, అంజ‌లిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement