Thursday, May 16, 2024

అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

నందిగామ, (ప్రభ న్యూస్) : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలొని నందిగామ మండల పరిధిలోని పెద్ద కుంట తండాలో ఇవ్వాల (శుక్రవారం) చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం పెద్ద కుంట తండాకు చెందిన పెంట్యా నాయక్ (29) అనుమానస్పదంగా ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడని తెలిపారు.

మృతికి గల కారణాలు కుటుంభ కలహాలేనని వివరించారు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. కుటుంభ తగాధాలే మృతికి కారణమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమొదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement