Monday, April 29, 2024

రెవెన్యూ డివిజన్‌గా కాటారం.. ఉత్తర్వులు జారీ

కాటారం, (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మాహా ముత్తారం, మల్హర్, పలిమల ఐదు మండలాల కలుపుకుని ప్రభుత్వం కాటారం ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసింది. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న ఐదు మండలాలకు కేంద్ర బిందువైన కాటారం రెవెన్యూ డివిజన్ ప్రకటించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement