Wednesday, May 8, 2024

ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ పై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం : ఓ ఇంటిని కూల్చివేసిన సంఘటనలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ పైన, ఆయనతో పాటు మరో ఏడుగురి పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జిల్లా, ఫాతిమా నగర్ కు చెందిన మొహాద్ గౌస్ తండ్రి రఫీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోచారం గ్రామంలో గ్రామకంట భూమిలో నిర్మించుకున్న ఇల్లు 1-98 (పాతది), 2-78 (కొత్తది) 3350 గజాల విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇల్లును కూల్చి స్థలాన్ని ఆక్రమించుకొని గ్రామ అవసరాల కోసం ప్లే గ్రౌండ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

23.01.2022న కృపేష్ ఆయన అనుచరులు అక్రమంగా చొరబడి జేసీబీతో గోడ రాళ్లను తొలగించారు. ఇంతలో ఫిర్యాదుదారుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నిస్తే, ఫిర్యాదు దారున్ని అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని తెలిపారు. తీవ్ర పరిణామాలుంటాయని ఫిర్యాదుదారుని బెదిరించారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement