Sunday, April 28, 2024

అమానవీయ ఘటన – మురికి కాలువలో శిశువు మృతదేహం

రామగిరి, (ప్రభన్యూస్‌): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొన్ని గంటల క్రితం పుట్టిన శిశువు మృతదేహం మురికి కాలువలో లభ్యం కావడం సంచలనం కలిగించింది. గ్రామంలోని ఓ మురికి కాలువలో శనివారం స్థానికులు మగ శిశువును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రవి ప్రసాద్‌ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement