Monday, April 29, 2024

యువకులను నిరాశ పరిచిన రాష్ట్ర బడ్జెట్

యాచారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ యువకులను నిరాశ పరిచిందని బిజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల శ్రీశైలం ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే యువకుల జీవితాలు బాగుపడుతాయి అనుకున్నాం కానీ ఈ విధంగా రోడ్డున పడుతామని అనుకోలేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన యువకులను విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మైమరిచి పోయిందని అన్నారు. తెరాస రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగు యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వక పోగా కనీసం ఈ బడ్జెట్‌లో వాటి గురించి ప్రస్తావన తేక పోవడం సిగ్గుచేటని అన్నారు. రాబోయే రోజుల్లో యువకులు పెద్ద ఎత్తున తెరాస ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తగిన బుద్ది చెపుతారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement