Friday, March 29, 2024

బాత్ రూమ్ ఓపెనింగ్ కి వస్తారా.. మనిషి పోతే రారా?

జగన్నాథంది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ జగన్నాథం శవంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను అసెంబ్లీ లో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు జగ్గారెడ్డి. ఆత్మహత్య చేసుకున్న కార్యదర్శి జగన్నాథం కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు. ఆందోళన విరమించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేయడం తో ఆందోళన విరమించారు. జగన్నాథంది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు.

బొందలగడ్డ లు, బాత్ రూమ్ ల ఓపెనింగ్ లకు వస్తున్నారు కానీ మనిషి చనిపోతే స్పందించడం లేదని తెరాస నాయకులకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కి మిఠాయిలు ఎందుకు తినిపిస్తున్నారో అర్థమే కావడం లేదు. జగన్నాథం ఉసురు ఈ ప్రభుత్వానికి,కేసీఆర్ కుటుంబానికి తగులుతుందన్నారు జగ్గారెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement